టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్ 2025లో తెలంగాణకు చెందిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్ ఈవెంట్లో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకం సాధించిన ధనుష్, తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. 23 ఏళ్ల శ్రీకాంత్, అంతకుముందు 2022లో బ్రెజిల్లో జరిగిన డెఫ్లింపిక్స్లోనూ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు గెలుచుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఈ షూటర్ ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్కు చెందిన 'గన్ ఫర్ గ్లోరీ' అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ధనుష్ సాధించిన ఈ విజయాలకు తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు శ్రీ ఏ. పి. జితేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి అభినందనలు తెలిపారు. సింగిల్స్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న వెంటనే, ధనుష్కు తెలంగాణ ప్రభుత్వం రూ. 1 కోటి 20 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa