ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు షాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 03:54 PM

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు, 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కోరుతూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో, స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అమర్ సింగ్ రాథోడ్, సండ్రు, నవీన్, కుండలి కిషోర్, బక్క నరస గౌడ్, బిక్షపతి తదితరులు గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసంలో వారికి పార్టీలోకి సాదర స్వాగతం లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa