తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET-2026) దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (నవంబర్ 29, 2025)తో అధికారికంగా ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ చివరి గంటల్లోనైనా త్వరగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఒక్క రోజు ఆలస్యం చేసినా అవకాశం పోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దరఖాస్తు చేసిన తర్వాత ఏవైనా తప్పులు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు సవరణ చేసుకునే సౌలభ్యం కల్పించారు. పేరు, విద్యార్హతలు, ఫోటో, సంతకం వంటి వివరాలను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఎవరు అర్హులు అనే ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా ఉంది. పేపర్-1 (1 నుంచి 5 తరగతులు) కోసం D.El.Ed / B.El.Ed / D.Ed ఉత్తీర్ణులైన వారు, పేపర్-2 (6 నుంచి 8 తరగతులు) కోసం డిగ్రీతో పాటు B.Ed పూర్తి చేసినవారు లేదా B.Ed ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు పేపర్లకు ఒకేసారి అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది.
పరీక్షలు 2026 జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అధికారిక వెబ్సైట్ schooledu.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు అన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. టీచర్ అవ్వాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం.. ఆలస్యం చేయకుండా ఈ రోజే అప్లై చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa