TG:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన సరస్వతి(22) ఈ నెల 4న HYD మీర్ పేట పీఎస్ పరిధిలోని ఓ హాస్టల్లో ఉరేసుకుని మృతి చెందింది. సరస్వతి, తన గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరగా అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెంది తమ కూతురు మృతి చెందిందని, ఇందుకు ప్రేమించిన యువకుడే కారణమని ఆరోపిస్తూ మంగళవారం ఆ యువకుడి ఇంటి ఎదుట మృతదేహంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa