బెల్జియం అధికారిక పర్యటనలో భాగంగా, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) రాష్ట్ర బృందం ప్రపంచ ప్రసిద్ధ కూలూవెన్ యూనివర్సిటీతో ముఖ్యమైన చర్చలు నిర్వహించింది.ఈ భేటీలో ప్రధానంగా భారత్-బెల్జియం దేశాల ఎన్నికల విధానాలను పోల్చి పరిశీలించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన పెంపొందించడం ప్రధాన అంశంగా నిలిచింది.కూలూవెన్ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ విభాగం డీన్ మరియు ప్రొఫెసర్లు బెల్జియం ఎన్నికల వ్యవస్థ, ఓటింగ్ విధానాలు, సంస్థాగత భద్రతా చర్యలు, ఆధునిక సవాళ్ల గురించి సమగ్రంగా భారత బృందానికి వివరించారు. దీనికి ప్రతిస్పందనగా, భారత ప్రతినిధులు దేశంలోని ఎన్నికల వ్యవస్థ, సామాజిక వైవిధ్యం, ఫెడరల్ నిర్మాణం వంటి ప్రత్యేక లక్షణాలను వివరించి, తులనాత్మక సమీక్షలో భాగంగా భారత ఎన్నికల ప్రక్రియను వివరించారు.తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడి, “ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలెక్షన్ మేనేజ్మెంట్ ఎన్నికల అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో, అంతర్జాతీయ అనుభవాలను పంచుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. శిక్షణ, సంయుక్త పరిశోధనలు, గ్లోబల్ ఉత్తమ విధానాల పంచకంలో భాగస్వామ్యానికి కూలూవెన్ యూనివర్సిటీ ముందుకు రావాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు.భారత బృందం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో 99 కోట్ల కంటే ఎక్కువ ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టే విధానాలు, ఎన్నికల సమగ్రత, పారదర్శకత మరియు కఠిన నియంత్రణ చర్యలను వివరించింది. ఈ సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్రెడ్డి, అనుదీప్ దురిశెట్టి, బోయపాటి చెన్నయ్య, కె. అనంత్రెడ్డి, ధృవ కుమార్రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa