TG: మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతులకు 'రైతు భరోసా' పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధుల సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ.9వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం RBIకి ఇండెంటు పెట్టినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు ఈ మొత్తం రుణాలు అందితే ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ నిధులు ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. అనంతరం ప్రభుత్వం ఈ సోమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa