ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు గృహ జ్యోతి (జీరో బిల్) పథకం కింద ప్రయోజనం పొందేందుకు అధికారులు సూచించారు. ఇంతకు ముందు లబ్ధి పొందని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తాజా కరెంట్ బిల్లు, ఫోన్ నంబర్ వంటి పత్రాలతో స్థానిక విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని ప్రకటనలో కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa