ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2025 నవంబర్ 9న ఎర్రకోటపై దాడిచేసింది జైషే మహమ్మద్ అని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 03:16 PM

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) సంచలన నివేదికను విడుదల చేసింది. గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి వెనుక జైషే హస్తం ఉందని, ఆ సంస్థ మహిళలతో ప్రత్యేకంగా ఒక ఉగ్రవాద విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.ఐరాస భద్రతా మండలికి చెందిన ఆల్-ఖైదా, ఐసిస్ ఆంక్షల పర్యవేక్షణ బృందం ఈ నివేదికను రూపొందించింది. 2025 నవంబర్ 9న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన దాడిలో 15 మంది మరణించారని, ఈ ఘటనతో జైషే మహమ్మద్‌కు సంబంధం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొంది. ఈ దాడితో పాటు మరికొన్ని దాడులకు జైషే బాధ్యత వహించినట్లు ఒక సభ్య దేశం తెలిపినట్లు నివేదికలో పొందుపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa