తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను ఆదరించని ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురానుంది. ఇందులో బాగంగా వారి జీతం నుంచి 10-15% కోత పెట్టి తల్లిదండ్రులకు చెల్లించేలా చట్టాన్ని రూపొందిస్తోంది. పేరెంట్స్ ఫిర్యాదులపై విచారణ చేసి నిజమని తేలితే వారి జాయింట్ ఖాతాలో ఈ సొమ్ము జమచేయనుంది. CS రామకృష్ణారావు, మాజీ CS శాంతికుమారిలతో కూడిన కమిటీ ముసాయిదా చట్టాన్ని రూపొందిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించనుంది. 2023 నుంచి నియమితులైన వారికి ఈ చట్టం వర్తించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa