కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్ పరిధిలోని సూరారంలో ఆస్తి పన్ను బకాయిలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో పన్ను చెల్లించని మూడు భవనాలను అధికారులు జప్తు చేశారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్ మాట్లాడుతూ, బకాయిలు ఉన్న యజమానులు వెంటనే పన్నులు చెల్లించాలని, లేదంటే మరిన్ని భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa