కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బుధవారం 128వ డివిజన్ పరిధిలోని చింతల్ ఎన్ఎల్బీ నగర్లో శ్రీ గణపతి శివలింగం, అభయాంజనేయ స్వామి, దుర్గామాత, దత్తాత్రేయ స్వామి, నవగ్రహ నాగదేవత ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే ఆలయంలో సర్వదేవతలు కొలువై ఉండటం విశిష్టమని, దైవారాధన ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ప్రశాంతతను పొందగలరని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa