రాష్ట్రంలోని 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఎస్ఏ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మార్చింది. గతంలో ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు ఇప్పుడు ఏప్రిల్ 8 నుంచే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8న 6 నుంచి 9 తరగతులకు ఫస్ట్ లాంగ్వేజీ, ఏప్రిల్ 9న 1 నుంచి 5 తరగతులకు ఫస్ట్ లాంగ్వేజీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల సమయాలు తరగతిని బట్టి మారుతాయి. అలాగే ఏప్రిల్ 23న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa