రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి అంగన్వాడీ కేంద్రం 2 లో పోషణ పక్వడ్ లో భాగంగా బుధవారం అంగన్వాడీ టీచర్ చొప్పరి అంజలి ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు సమతుల్య ఆహారం తీసుకోవాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ గడ్డం చందన, గ్రామ సర్పంచ్ అడ్డికా లక్ష్మి, వార్డ్ సభ్యులు శివరాత్రి మంజుల, ఆశ వర్కర్ వంగ సంతోష, గర్భవతులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa