TG: రాబోయే రెండు రోజులు (గురు, శుక్రవారాల్లో) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 - 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎండల దృష్ట్యా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa