తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
కాగా సోమవారం శ్రీవారిని 58,176 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,157 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa