మాల్దీవులకు భారత్ హెచ్చరికలు పంపించింది. అలా చేస్తే ఆర్థికంగా నష్టపోతారని, స్థిరత్వం కోల్పోయి సమస్యల్లో చిక్కుకుంంటారని వార్నింగ్ ఇచ్చింది. చైనా, తుర్కియో దేశాలతో మాల్దీవులు స్వేచ్ఛా వాణిజ్య, ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఇలాంటి దేశాలతో ఆ తరహా ఒప్పందాలు చేసుకోవద్దని మాల్దీవులకు భారత్ జాగ్రత్తలు చెప్పింది. ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల గణనీయంగా ఆదాయం కోల్పోతుందని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని వివరించింది. అలాగే భారత్ తన సొంత విధానాలను రూపొందించే సమయంలో ఈ ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
కొన్ని నెలల క్రితం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ తర్వాత తత్వం బోధపడి భారత్కు వచ్చి సాయం కోరారు మాల్దీవుల దేశ అధ్యక్షుడు ముయిజ్జు. ఈ పర్యటనలో భాగంగా 400 మిలియన్ డాలర్ల ద్వైపాక్షిక కరెన్సీ స్వాప్ ఒప్పందంతో పాటు 30 బిలియన్ ఇండియన్ కరెన్సీ ఇచ్చి సాయం చేసినందుకు భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. నాడు ముయిజ్జుకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అభివృద్ధి భాగస్వామ్యాన్ని ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన పిల్లర్గా అభివర్ణించారు. మాల్దీవుల ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.
మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం విషయంలో ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో చర్చిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే మాల్దీవులు చైనా, తుర్కియేతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆ దేశ ఆదాయానికి గణనీయంగా తగ్గిస్తాయని ఆ ప్రభావం దీర్ఘ కాలికంగా ఆర్థిక స్థిరత్వంపై పడుతుందని చెప్పారు. ఈ ఒప్పందాలను భారత దేశ విధానాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
మాల్దీవులు 2018లో చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. అయితే ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆ ఒప్పందాలను అమలులోకి తీసుకు వచ్చింది. అలాగే గత సంవత్సరం నవంబర్లో తుర్కియోతో కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుంది మాల్దీవులు. ఈ విషయం తెలుసుకున్న భారత్ వాటి వల్ల కల్గే నష్టాల గురించి వివరించింది. చూడాలి మరి మాల్దీవుల్ ఇప్పుడు ఏం చేయబోతుందనేది.