ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మహిళలకు .. సొంత వ్యాపారానికి రూ.2 కోట్ల వరకు లోన్

business |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 11:52 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కొన్ని వర్గాల వారికి ప్రత్యేక స్థానం కల్పించారు. వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. అలాగే సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు శుభవార్త అందించారు ఆర్థిక మంత్రి. ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారం చేయాలనుకునే వారికి కొత్త రుణ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు ఇస్తామని తెలిపారు. ఒక్కొక్కరికి వ్యాపారాన్ని బట్టి రూ.2 కోట్ల వరకు రుణాలు ఇస్తామని తెలిపారు.


మరోవైపు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక తయారీ మిషన్‌తో ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎక్కువగా కార్మికులు అవసరమయ్యే రంగాల ఉత్పాదకతను పెంచేందుకు తగిన సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఆయా పరిశ్రమలు తీసుకున్న క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని రెట్టింపు చేశారు. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే గ్యారెంటీ ఫీజును 1 శాతానికి పరిమితమయ్యేలా చేస్తామన్నారు. క్రెడిట్ గ్యారెంటీ కవరేజీ అంటే ఏదైనా లోన్ తిరిగి చెల్లించలేని పక్షంలో ఎంత మాఫీ చేస్తారో తెలిపే ప్రమాణం. ఇకపై రూ.20 కోట్ల వరకు రుణ మాపీ పొందే అవకాశం లభిస్తుంది.


అలాగే బొమ్మల తయారీలో చైనాకు పోటీ ఇచ్చేందుకు మేడిన్ ఇండియా బ్రాండ్ విశ్వవ్యాప్తం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బొమ్మల తయారీ యూనిట్లతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆయా యూనిట్ల నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాగే రుణ సదుపాయం కల్పిస్తారు. విభిన్నంగా, నాణ్యమైన, వైవిధ్యమైన బొమ్మలను తయారు చేసే యూనిట్లను సర్కారు ప్రోత్సహించనుంది. టాప్-50 పర్యటక ప్రదేశాల అభివృద్ధి దేశంలో పర్యాటక వికాసానికి ప్రత్యేక చర్యలు చేపడతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోని టాప్ 50 పర్యటక ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. పర్యటకులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను, వసతులు కల్పిస్తామని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com