మైత్రి మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న హీరో రామ్ పోతినేని సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం జరిగింది. కొవ్వూరు పట్టణంలోని లాంచీలరేవు వద్ద గోదావరి ఏటిగట్టు రోడ్పై రావు రమేష్ సైకిల్పై తన కొడుకును ఎక్కించుకుని వెళ్తున్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో హీరోగా రామ్ పోతినేని, హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే, ప్రధాన తారాగణం రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్థన్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ మార్విన్ అందజేస్తున్నారు. మరో 40రోజులపాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగుతుందని దర్శకుడు మహేష్బాబు, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు స భ్యులు తెలిపారు. సినిమా షూటింగ్ కార ణంగా రాజమహేంద్రవరం నుంచి కొవ్వూ రు మీదుగా ఏలూరు వైపు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
![]() |
![]() |