ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్ యువత తప్పు చేసింది: అవామీ లీగ్ అగ్రనేత

international |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 10:06 PM

షేక్ హసీనా త్వరలోనే బంగ్లాదేశ్‌కు ప్రధాన మంత్రిగా తిరిగి వస్తారని అమెరికా అవామీ లీగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రబ్బీ ఆలం తెలిపారు. ఇన్నాళ్లు షేక్ హసీనాకు సురక్షితమైన ఆశ్రయం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బంగ్లాదేశ్ యువత తప్పు చేసిందని.. కానీ అది వారి తప్పు కాదన్నారు. కొందరు నాయకులు వారిని మోసం చేసి వారు తప్పు చేసేలా ప్రోత్సహించారని వివరించారు. అంతటితో ఆగకుండా దేశం దాడికి గురైందని.. దాన్ని అంతర్జాతీయ సమజాం పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయ తిరుగుబాటు సమ్మతమైనదే కానీ బంగ్లాలో జరిగింది ఉగ్రవాద తిరుగుబాటు అంటూ వ్యాఖ్యానించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


రిజర్వేషన్ల కోటా అంశంతో బంగ్లాదేశ్ రణరంగంగా మారింది. ముఖ్యంగా 2024 ఆగస్టు నెలలో నిరసనకారులు ప్రధాని ప్యాలెస్‌ను చుట్టుముట్టగా.. 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి షేక్ హసీనా ఆగస్టు 5వ తేదీన ఆ భారత దేశానికి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతోంది. అయితే ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయనే దేశాన్ని పాలిస్తున్నారు. కానీ షేక్ హసీనా తిరిగి అక్కడకు రప్పించేందుకు పెద్ద ఎత్తునే చర్యలు చేపడుతున్నారు.


 షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ.. భారత విదేశాంగ శాఖకు లేఖ కూడా రాసింది బంగ్లాదేశ్ సర్కారు. దీనిపై ఇప్పటి వరకు భారత్ స్పందించలేదు. అయితే తాజాగా షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడు, అమెరికా అవామీ లీగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రబ్బీ ఆలం షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా షేక్ హసీనాకు తిరిగి బంగ్లాదేశ్‌కు ప్రధాన మంత్రిగా వస్తున్నారని వివరించారు. అక్కడి యువతరం తప్పు చేసిందని.. కానీ అది వారి తప్పు కాదని తెలిపారు. కొందరు నేతలు వారలా చేసేలా ప్రోత్సహించి.. మోసగించారని వెల్లడించారు.


బంగ్లాదేశ్ దాడికి గురైందని.. అంతర్జాతీయ సమాజం ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని డాక్టర్ రబ్బీ ఆలం తెలిపారు. రాజకీయ తిరుగుబాటు సమ్మతమైనదేనని కానీ.. బంగ్లాలో జరిగింది ఉగ్రవాద తిరుగుబాటు అని వ్యాఖ్యానించారు. తమ నాయకుల్లో చాలా మంది భారత దేశం వచ్చి ఆశ్రయం పొందుతున్నారని అన్నారు. వారందరికీ సాయం చేసినందుకు భారత దేశానికి, ప్రజలకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. త్వరలోనే షేక్ హసీనా బంగ్లా వెళ్లే అవకాశం ఉందని కామెంట్లు చేస్తున్నారు.


గూగుల్ ట్రెండ్స్‌లో షేక్ హసీనా


షేక్ హసీనా గురించి రబ్బీ ఆలం చేసిన వ్యాఖ్యలతో బంగ్లాదేశ్ రాజకీయాల గురించి మరోసారి చర్చ జరుగుతోంది. షేక్ హసీనాకు సంబంధించిన తాజా వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. దీంతో షేక్ హసీనా గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచారు. భారత్‌‌లో బీహార్, చంఢీగర్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, త్రిపురలో షేక్ హసీనా గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com