సన్రైజర్స్ ఫ్యాన్స్కి పెద్ద గుడ్ న్యూస్. టీమిండియా స్టార్ట్ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీశ్కుమార్ రెడ్డి త్వరలోనే ఎస్ఆర్హెచ్ క్యాంప్లో జాయిన్ కాబోతున్నాడు. రెండు నెలలుగా ఇంజ్యూరీతో బాధపడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడంటూ నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందుగానే జట్టుతో కలవనున్నాడు.
ఐపీఎల్ 2025 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్ల ప్లేయర్లు తమ తమ ప్రాక్టీస్ క్యాంప్లకు చేరుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత ప్లేయర్లు కూడా ఒక్కొక్కరిగా తమ జట్లతో కలుస్తున్నారు. గాయాలపాలయిన టీమిండియా క్రికెటర్లకు కూడా వారి ఫిట్నెస్ ఆధారంగా బీసీసీఐ ఐపీఎల్కి వెళ్లేందుకు అనుమతి ఇస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఫిట్నెస్ టెస్టు అనంతరం బెంగళూరులోని ఎన్సీఏ ఐపీఎల్కి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి టీమిండియాలో అవకాశం దక్కింది. కేవలం టీ20ల్లోనే కాకుండా టెస్టుల్లో కూడా ఛాన్స్ వచ్చింది.
భారత్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్తో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఆ సిరీస్లో బ్యాట్తోనే కాకుండా బంతితో కూడా రాణించాడు. అనంతరం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ప్లేస్ దక్కించుకుని సెంచరీ కూడా నమోదు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి రెండు నెలల పాటు జట్టుకు దూరమయ్యాడు.
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్తో ఆడే తొలి మ్యాచ్కి నితీష్ రెడ్డి అందుబాటులో ఉండనున్నడు. ఓవరాల్గా 15 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 11 ఇన్నింగ్స్లలో 76 హైయెస్ట్తో 303 పరుగులు చేశాడు. అతని ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. తొమ్మిది ఇన్నింగ్స్లలో బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో మరింతగా రాణించి 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని నితీశ్ కుమార్ రెడ్డి చూస్తున్నాడు.
![]() |
![]() |