ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంపర్ రిటర్న్స్,,,ఎలాంటి రిస్కూ లేని ఆరు పెట్టుబడులివే

business |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 10:13 PM

మీరు సంపాదించే దాంట్లో నుంచి ఏమైనా పొదుపు చేసి దీనిని మదుపు చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఇబ్బందుల్లేకుండా గడపాలంటే.. భవిష్యత్తులో ఎవరి సహాయం లేకుండా జీవించాలంటే.. ఇది తప్పనిసరి. ఇక భారతదేశంలో ఎన్నో పెట్టుబడి పథకాలు మన కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బ్యాంకులు అందించేటువంటి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి సంప్రదాయ పెట్టుబడి పథకాలు వంటివి ఉన్నాయి. వీటి గురించి మనకు తెలిసే ఉంటుంది. అయితే ఇవే కాక.. రిస్క్ లేని పథకాలు ఇంకా చాలానే ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు చూద్దాం.


పోస్టాఫీస్ పథకాలు- పోస్టల్ శాఖ ప్రస్తుతం ఎన్నో మదుపు పథకాల్ని అమలు చేస్తోంది. వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, మంత్లీ ఇన్‌కం సర్టిఫికెట్, రికరింగ్ డిపాజిట్ మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడి, రిటర్న్స్‌పై కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ ఉండదు.


సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్- పోస్టాఫీస్ సహా ప్రముఖ బ్యాంకుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. రిటైర్మెంట్ తీసుకున్న సీనియర్ సిటిజెన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక్కడ వార్షిక వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. దీంట్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం రూ. 1000; గరిష్టంగా రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా రిస్క్ ఉండదు. గ్యారెంటీ రిటర్న్స్ ఆశించవచ్చు.


ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు- 2020 జులైలో ఆర్బీఐ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ బాండ్లపై వడ్డీ రేట్లు 6 నెలలకు ఓసారి మారుతుంటాయి. ఇక్కడ కూడా రిస్క్ ఉండదు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు కంటే 0.35 శాతం ఎక్కువ వడ్డీ రేటు ఉంది. ప్రస్తుతం 8.05 శాతంగా ఉందన్నమాట. ఇక్కడ ఏడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది.


మున్సిపల్ బాండ్స్- దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లు లేదా వీటి అనుబంధ సంస్థలు జారీ చేస్తాయి. వీటి ద్వారా సేకరించిన నిధుల్ని .. పాఠశాలలు, ఆస్పత్రులు, వంతెనలు వంటివి నిర్మించడం .. తమ పరిధి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తాయి. ఇక్కడ కూడా రిస్కే లేదు.


ట్రెజరీ బిల్స్- టీ- బిల్స్ అని పిలిచే ట్రెజరీ బిల్లుల్ని భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇక్కడ సంవత్సరం కాలవ్యవధికి పెట్టుబడి సేకరించడం ఉద్దేశం. రాబడి మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ మద్దతు ఉన్నందున సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు.


మనీ మార్కెట్ ఫండ్స్- ఇది డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు. పెట్టుబడులకు సంబంధించి స్థిరమైన రాబడుల్ని అందిస్తాయన్న ఉద్దేశంతో దీనిని లాంఛ్ చేశారు. వీటినే స్వల్పకాలిక రుణ నిధులు అని కూడా అంటారు. సుమారు 12 నెలల సగటు మెచ్యూరిటీతో లభిస్తాయి. రిస్క్ పరిమితంగానే ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com