ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు గ్రాముకు రూ. 2943.. ఇప్పుడు రూ. 8624

business |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 10:31 PM

 బంగారంపైన పెట్టుబడులు పెట్టేందుకు మనకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇంకా.. భౌతిక బంగారం కూడా ఉన్నప్పటికీ.. ఈ కొనుగోళ్లను తగ్గించే ఉద్దేశంతో.. 2015లో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల కోసం సావరిన్ గోల్డ్ బాండ్ పథకం లాంఛ్ చేసింది. దీనికి అప్పట్లో మంచి ఆదరణ ఉండేది. బంగారం ధర పెరిగిన దానిని బట్టి రిటర్న్స్ వస్తుంటాయి. ఇక్కడ కనీసం గ్రాము నుంచి గోల్డ్ కొనేందుకు ఛాన్స్ ఉంటుంది. గ్రామును యూనిట్‌గా పరిగణిస్తారు. ఇండివిడ్యువల్స్ గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు. ట్రస్టులు, యూనివర్సిటీలు వంటివి 20 కిలోల వరకు కొనేందుకు అవకాశం ఉంటుంది.


ఇక గోల్డ్ బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంటుంది. గోల్డ్ బాండ్లను ఇష్యూ చేసే ముందు.. అలాగే రిడెంప్షన్ తేదీలకు ముందు మూడు రోజుల సగటు ధర ఆధారంగా గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైస్, రిడెంప్షన్ ప్రైస్ ప్రకటిస్తుంది ఆర్బీఐ. ఈ ధరల్ని మాత్రం ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్  నిర్ణయిస్తుంది.


 గతంలో ఒక నెలలోనే చాలా సార్లు గోల్డ్ బాండ్లు జారీ చేసేది.. తర్వాత దీనిని తగ్గించి నెలకోసారి.. ఆ తర్వాత మళ్లీ త్రైమాసికానికి ఒక సారి ఇలా బాండ్లను జారీ చేయగా.. ఇటీవల మాత్రం దీనిని నిలిపివేసింది. గతేడాది ఫిబ్రవరిలో చివరిసారి రాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జారీ చేయలేదు. వీటిని దాదాపు ముగించినట్లే కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవల బడ్జెట్ సమయంలో వెల్లడించాయి.


గోల్డ్ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా.. 5 సంవత్సరాల తర్వాత ముందుగానే ఉపసంహరించుకునేదుకు ఛాన్స్ ఉంటుంది. బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగిన క్రమంలో.. అప్పట్లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి మంచి రిటర్న్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇటీవల ఆర్బీఐ గతంలో ఇష్యూ చేసిన గోల్డ్ బాండ్లకు సంబంధించి.. రిడెంప్షన్ తేదీల్ని, రిడెంప్షన్ ధరల్ని.. ప్రీమెచ్యూర్ రిడెంప్షన్, ప్రైస్ ప్రకటిస్తూ వస్తోంది.


2016-17 సిరీస్ IV కు సంబంధించి మెచ్యూరిటీ ఇటీవల 2025 మార్చి 17కు ముగిసింది. అప్పట్లో గ్రాముకు రూ. 2,943 చొప్పున ఇష్యూ చేయగా.. రిడెంప్షన్ ప్రైస్ రూ. 8,624 ప్రకటించింది. దీంతో బంపర్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇంకా దీనికి వడ్డీ కూడా అందిస్తుంది. అప్పట్లో 2.50 శాతం వడ్డీ రేటు ఉంది. ఆన్‌లైన్‌లో గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక పెట్టుబడి పరంగా చూస్తే అప్పుడు రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 2.93 లక్షలు వచ్చాయి. వడ్డీతో కలిపి రూ. 3 లక్షలకుపైనే వచ్చిందని చెప్పొచ్చు. దీంతో మూడింతల లాభం వచ్చింది. మరోవైపు.. 2019-20 సిరీస్ IV కు సంబంధించి ఇష్యూ ధర గ్రాముకు రూ. 3800 కాగా.. ఇప్పుడు ఐదేళ్లు దాటగా ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ రూ. 8,634 గా ప్రకటించింది. ముందుగా తీసుకోవాలనుకుంటే.. ఇక్కడ చూస్తే రూ. లక్ష పెట్టుబడిపై రూ. 2.27 లక్షలు వచ్చాయి. వడ్డీతో కలిపి ఇంకా ఎక్కువే వచ్చిందని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com