ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తజికిస్థాన్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది

international |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 02:41 PM

తజికిస్థాన్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.4 పాయింట్లుగా నమోదైంది. ఆదివారం ఉదయం 9.54 గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా, మయన్మార్‌లో నేడు మరోసారి భూకంపం సంభవించింది. ఇక్కడి మీక్తిలియా ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com