తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తమ ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకు వెళ్లట్లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్లో ఎంత ఆవేశం ఉన్నా.. గత జగన్ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత చెప్పారు.
![]() |
![]() |