వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన ప్రయోజనం కోసమే పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటెలెక్చువల్స్ వింగ్ ఏర్పాటు చేశారని,ప్రజల్లోకి పార్టీ భావజాలాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు వై ఈశ్వర ప్రసాద్ రెడ్డి, అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ ఇంటెలెక్చువల్ పోరం విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.
![]() |
![]() |