రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో నిలువగా 85.43 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా 9వ స్థానంలో నిలిచింది.
![]() |
![]() |