జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాలను అలర్ట్ చేశారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. అటు హైదరాబాద్లో ఉన్న పాక్ పౌరుల వివరాలు సేకరించిన పోలీసులు.. 2 రోజుల్లో భాగ్యనగరాన్ని వదిలి వెళ్లాలని ఆదేశించారు.
![]() |
![]() |