బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 14 మందికి రూ. 10, 18, 780 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
పేదలకు వైద్య సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుoటుందని ఎమ్మెల్యే వేగేశన పేర్కొన్నారు. సీఎం సహాయ నిధిని వినియోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన సూచించారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే వేగేశన కు కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |