ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా బిడ్డ బితికే ఉన్నాడా?.. ఎప్పుడు తిరిగొస్తాడు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 08:12 PM

పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్-భారత దేశాల మధ్య తీవ్ర వివాదం నడుస్తుండగా.. ఓ బీఎస్ఎఫ్ జవాన్ అనుకోకుండా పాక్ భూభాగంలోకి వెళ్లాడు. అయితే విషయం గుర్తించిన పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకుని.. భారత సైన్యానికి సమాచారం అందించారు. ప్రస్తుతం జవాన్ వారి దగ్గరే ఉండగా.. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు బతికే ఉన్నాడా లేడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బతికుండాలని దేవుడుని కోరుకుంటూనే.. ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్ ..ఫిరోజ్ పూర్ ప్రాంతంలో గస్తీ కాస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉండే రైతుల పంటలకు భద్రతగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం రోజు కూడా కొంత మంది రైతులకు గస్తీ కాస్తున్న ఆయన.. ఎండ వేడికి తట్టుకోలేక కాస్త అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో అక్కడకు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. వెంటనే నడుచుకుంటూ వెళ్లి పడుకున్నారు. అయితే అది పాక్ భూభాగం కావడం.. పాక్ రేంజర్లు ఆ విషయాన్ని గుర్తించడంతో బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆ విషయాన్ని భారత సైన్యానికి కూడా తెలియజేశారు.


ఈక్రమంలోనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్.. పాక్ రేంజర్స్‌తో సమావేశం నిర్వహించింది. అతడు తెలియకుండానే మీ భూభాగంలోకి వచ్చాడని.. కాబట్టి అతడిని వదిలేయాలని సూచించింది. కానీ ఇప్పటి వరకు పాక్ రేంజర్లు దీనిపై స్పందించలేదు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య తీవ్ర వాగ్వాదం సాగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గమనే స్థాయిలో గొడవ సాగుతుండగా.. భారత అధికారులు మాత్రం బీఎస్ఎఫ్ జవాన్‌ను విడిపించేందుకు పాక్ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ పాక్ నుంచి ఇంకా ఎలాంటి సందేశమూ రాలేదు.


అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ తండ్రి భోల్‌నాథ్ సాహు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు దేశం కోసం సేవ చేస్తున్నాడని.. సెలవు ముగించుకుని 3 వారాల క్రితమే తిరిగి విధుల్లో చేరాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పాక్ కస్టడీలో ఉన్నాడని తమకు అధికారులు చెప్పారని.. అతడి పరిస్థితి ఎలా ఉందో తెలియాక అల్లాడిపోతున్నామన్నారు. అతడు క్షేమంగానే ఉన్నాడా, అసలు బతికే ఉన్నాడా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందని, మళ్లీ తన కుమారుడు ఇంటికి ఎప్పుడు తిరిగొస్తాడని భోల్‌నాథ్ సాహు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


మరోవైపు పీకే సింగ్ తల్లి పూర్ణం సాహు మాట్లాడుతూ.. మంగళ వారం రోజు రాత్రి తనే కుమారుడు పోన్ చేసి మాట్లాడాడాని తెలిపారు. అదే అతడి గొంతు వినడం చివరి సారి అని.. మళ్లీ ఫోన్ చేస్తే కలవలేదని చెప్పుకొచ్చారు. బుధవారం రాత్రి ఆయన స్నేహితుడు ఫోన్ చేసి జరిగిందంతా వివరించాడని.. అప్పటి నుంచి అతడి పరిస్థితి ఎలా ఉందో తెలియక ఏడుస్తూనే ఉన్నామన్నారు. తన తండ్రికి ఏమైందో తెలియకు తమ ఏడేళ్ల మనవడు కూడా బాధ పడుతూ.. పదే పదే తమను ప్రశ్నిస్తున్నాడని పేర్కొన్నారు. వీలయినంత త్వరగా తమ కుమారుడిని ఇంటికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com