ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాంలో భద్రత ఎందుకు కల్పించలేదు?.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 08:43 PM

జమ్ము కశ్మీఉగ్రదాడి లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘనటలో మొత్తంగా 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఉగ్రదాడి జరిగిన సమయంలో బైసరన్ లోయ వద్ద ఎలాంటి భద్రతా సిబ్బంది లేరు. ఈ విషయాన్ని గుర్తించిన అనేక మంది దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే ప్రమాదానికి ఓ పెద్ద కారణం అయి ఉంటుందంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ప్రజలు సైతం దీని గురించి ఆలోచిస్తుండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దాడి సమయంలో అక్కడ భద్రతా బలగాలు లేవని వివరించింది. అయితే వారక్కడ లేకపోవడానికి ఓ కారణం ఉందంటూ.. అదేంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


పహల్గాం ఉగ్రదాడి విషయంపై ఢిల్లీలో గురువారం రోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈక్రమంలోనే ప్రతిపక్షాలు.. ఈ ఘటన వెనుక భద్రతా వైఫల్యం ఉందని, దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు. అసలు దాడి జరిగిన సమయంలో భద్రతా బలగాలు, సీఆర్పీఎఫ్ ఎక్కడ ఉన్నాయని నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దీనికి ప్రభుత్వం తరఫు నుంచి ఓ కేంద్ర మంత్రి బదులు ఇచ్చారు. సాధారణంగా జూన్ నెల నుంచి ప్రారంభం అయ్యే అమర్ నాథ్ యాత్ర వరకు ఈ లోయ వద్దకు పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.


అయితే ఈసారి కాస్త ముందుగానే బైసరన్ లోయను తెరిచిన స్థానిక అధికారులు.. భద్రతా బలగాలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. అంతేకాకుండా ఈ ఎత్తులో ఉండే ప్రాంతానికి చేరుకోవాలంటే 45 నిమిషాల పాటు నడుచుకుంటూనే వెళ్లాల్సి ఉంటుందని.. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమల్లో లేదని వివరించారు. కానీ కేంద్ర మంత్రి ఇచ్చిన ఈ సమాధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయినా వేలాది మంది పర్యటకులు అక్కడకు వెళ్తుంటే ప్రభుత్వానికి తెలియకపోవడం ఏంటని ప్రశ్నించారని సమాచారం.


అయితే అసలు తొలిసారి బైసన్ లోయ వద్ద ఎందుకు భద్రతా బలగాలు లేరని ఓ ఎంపీ ప్రశ్నించారు. అసలు ఆ లోయను తెరిచినట్లు మహారాష్ట్రలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు తెలిసినప్పుడు.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఎలా తెలియకుండా ఉంటుందని ఎంపీ సుప్రియా సూలే అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటికీ సమాధానంగానే అఖిలపక్ష సమావేశంలో కేంద్ర తరఫున మంత్రి క్లారిటీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com