మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించిన చంద్రబాబు ‘మత్స్యకార చేయూత’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కష్టాలు తాను దగ్గర నుంచి చూశానని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే మత్స్యకార చేయూత పథకం కింద ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు.
![]() |
![]() |