ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొంతు కోస్తానంటూ భారతీయులకు పాక్ ఆర్మీ అధికారి హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 08:30 PM

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, దాయది పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఉగ్రదాడికి పాకిస్థానే కారణమని ఇండియా నమ్ముతుంది. అందుకు తగ్గట్టుగానే చర్యలు కూడా తీసుకుంటుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇండియా వచ్చిన పాకిస్థాన్ ప్రజలను తిరిగి వారి దేశం వెళ్లాల్సిందిగా సూచించింది. వీటితో పాటుగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టుల ఏరివేతకు చర్యలు ప్రారంభించింది. ఇలా నలుదిక్కుల పాకిస్థాన్ చుట్టూ ముడి బిగస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాల్లో ఉంది ఇండియా. ఇక ప్రపంచ దేశాలు సైతం ఈ ఉగ్రదాడిని ఖండించి భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ దాయాది పాకిస్థాన్‌ నుంచి మాత్రం భిన్నమైన ప్రవర్తన కనిపిస్తుంది. ఉగ్రవాదులను స్వతంత్ర సమరయోధులుగా కీర్తిస్తున్నారు ఆ దేశ రాజకీయనాయకులు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ అధికారి ఒకరు బరితెగింపు చర్యలకు పాల్పడ్డాడు. వందల మంది ఎదుటనే.. మీ గొంతు కోస్తానంటూ ఇండియన్స్‌ని హెచ్చరించాడు. ఆ వివరాలు..


పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా.. అన్ని దేశాల్లో ఉన్న భారతీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా లండన్‌లోని భారతీయు పాకిస్థాన్ హై కమిషనర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు కొందరు భారతీయ ఆందోళనకారులు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ తన చేతిలో భారతీయ వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ పోస్టర్‌ను బెదిరింపులకు పాల్పడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజనులు దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


లండన్ లోని హైకమిషన్ లో పాక్ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ భారతదేశానికి చెందిన నిరసనకారులను ఉద్దేశించి.. బహిరంగంగా.. అందరూ చూస్తుండగానే గొంతు కోస్తామని బెదిరిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ 500 మందికి పైగా భారతీయులు శుక్రవారం లండన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భారత జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు.


పహల్గాం ఉగ్ర దాడిలో సుమారు 26 మంది అమాయకులు చనిపోవడంతో.. ప్రజలు శోకసంద్రంలో మునిగి ఉన్నారు. ఇలాంటి విషాదకర సమయంలోపాక్ హైకమిషన్ బిగ్గరగా మ్యూజిక్ ప్లే చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసనకారులు ఖండించారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని అధికారులు తాము నిరసన సమయంలో బిగ్గరగా సంబరాలు జరుపుకోవడం సిగ్గు చేటని వారు విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com