ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే ఏపీ పాలిసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల

Education |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 11:20 PM

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ పాలిసెట్‌ 2025 పరీక్ష ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌కు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్‌కు 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 94 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే.. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. అనంతరం మే 10వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రిలిమినరీ కీ, ఫలితాల కోసం అధికారక వెబ్‌సైట్‌ చూడొచ్చు.


ప్రవేశాలు కల్పించే సంస్థలు:


ఏపీ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీ పాలిసెట్‌ 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రక్రియ మార్చి 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 15 వరకు కొనసాగింది. అనంతరం ఏప్రిల్‌ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa