భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాడు, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే, వన్డే ఫార్మాట్లో భారత జట్టుకు తన సేవలు కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. ఈ నిర్ణయంతో సుదీర్ఘ ఫార్మాట్లో హిట్ మ్యాన్ 11 ఏళ్ల కెరీర్కు తెరపడింది.రోహిత్ శర్మ తన టెస్ట్ ప్రస్థానంలో మొత్తం 67 మ్యాచ్లు ఆడాడు. 2022లో విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్, 24 మ్యాచ్లలో జట్టును నడిపించాడు. తన కెరీర్లో మొత్తం 4301 పరుగులు సాధించిన రోహిత్, ఇందులో 12 శతకాలు నమోదు చేశాడు. "హలో ఎవ్రీ వన్... నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. సుదీర్ఘ ఫార్మాట్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇన్నేళ్లుగా మీరు చూపిన ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. ఇకపై నేను వన్డే ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాను" అని రోహిత్ తన ప్రకటనలో పేర్కొన్నారు.భారత జట్టు త్వరలో ఇంగ్లాండ్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జట్టు ఎంపిక త్వరలో జరగనుండగా, ఇప్పుడు కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కొన్ని నెలల కిందట ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్, తన పేలవమైన ఫామ్ కారణంగా ఒక దశలో జట్టు నుంచి కూడా తప్పుకున్నారు. ఆ సిరీస్ను భారత్ 4-1 తేడాతో కోల్పోయింది. గత ఏడాది చివర్లో మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ రోహిత్ కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేస్తారని వార్తలు ఇటీవల వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, సెలెక్టర్లు రోహిత్ శర్మతో మాట్లాడి ఉంటారని, అందువల్లే రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకుని ఉండొచ్చని తెలుస్తోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa