ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11 వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందన్న ఇషాక్ దార్

international |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 06:20 PM

భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం, అక్కడి రాజకీయ నాయకుల నుంచి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఒకవైపు తమకేమీ నష్టం జరగలేదని, విజయం తమదేనని పాక్ ప్రధాని వంటి ఉన్నత స్థాయి నేతలు ప్రకటిస్తుండగా, మరోవైపు క్షేత్రస్థాయి వాస్తవాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. తాజాగా, పాకిస్థాన్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఈ అంశంలో కొత్త చర్చకు దారితీశాయి.భారతదేశంతో జరిగిన ఇటీవలి ఘర్షణల నేపథ్యంలో పాకిస్థాన్‌లోని తమ 11 వైమానిక స్థావరాలపై భారత్ పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసిందని ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ విమానాలు కూడా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. అయితే, పాకిస్థాన్‌కు చెందిన ఒక జెట్‌ను భారత్ కూల్చివేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ, తమ జెట్ స్వల్పంగా మాత్రమే దెబ్బతిన్నట్లు ఇషాక్ దార్ పేర్కొన్నారు. భారత పైలట్లు ఎవరూ తమ అదుపులో లేరని కూడా ఆయన స్పష్టం చేశారు.గతంలో, ఆపరేషన్ సిందూర్‌‌లో పాకిస్థాన్ విజయం సాధించిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అంతేకాకుండా, పాకిస్థాన్ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, మాజీ క్రికెటర్ ఆఫ్రిది వంటి వారు పాల్గొన్న విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించారు. పాక్ కు జరిగిన నష్టాన్ని భారత్ ఉపగ్రహ చిత్రాలతో సహా స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ, తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, పైగా భారత్‌కే తీవ్ర నష్టం కలిగిందని పాకిస్థాన్ ఒక దశలో ప్రచారం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com