ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క దెబ్బకు రూ.1500 కోట్లు లాస్,,,టర్కీకి భారత్ షాక్

national |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 08:04 PM

పహల్గాం ఉగ్రదాడితో భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 26 మంది అమాయక ప్రజలను చంపింది పాక్ ఉగ్రవాదులేనని గుర్తించి ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో దాయాది దేశం సైతం ప్రతిదాడులు చేసింది. ఇలాంటి సమయంలోనే టర్కీ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం గుర్తు పెట్టుకున్న భారతీయులు.. ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా పుణేలోని వ్యాపారులు టర్కీ నుంచి వచ్చే పండ్లపై నిషేధం విధించారు. యాపిల్స్‌ను వారి వద్ద నుంచి అస్సలే దిగుమతి చేసుకోవడం లేదు. ఫలితంగా పుణేలోని మార్కెట్ యార్డుల్లో టర్కిష్ యాపిల్స్ కనుమరుగయ్యాయి.


పుణే మార్కెట్ కమిటీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటుంది. అందులోనూ టర్కీ నుంచి ఎక్కువగా యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటుంది. అలాగే చెర్రీస్, ప్లమ్స్, పియర్ పండ్లను కూడా కొనగులో చేస్తూ ఉంటుంది. సీజన్‌కు తగ్గట్లుగా ఇలా ఆయా పండ్లను దిగుమతి చేసుకుంటూ.. పుణే వ్యాపారాలను సాగిస్తుంది. అయితే ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. దాయాది దేశానికి తుర్కియే మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఇలా అధికారికంగా తాము పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించగా.. ఈ విషయాన్ని భారతీయులంతా గుర్తించారు.


ముఖ్యంగా పుణే వ్యాపారులు దాన్ని గుర్తు పెట్టుకుని మరీ టర్కీపై పగ తీర్చుకుంటున్నారు. ఆ దేశం నుంచి వచ్చే పండ్లపై నిషేధం విధించారు. ప్రస్తుతం అక్కడి నుంచి పెద్ద ఎత్తున యాపిల్స్ వస్తుండగా.. వాటిని అస్సలే దిగుమతి చేసుకోవడం లేదు. ఫలితంగా పుణేలోని మార్కెట్ యార్డులన్నీ టర్కిష్ యాపిల్స్ లేక వెలవెలబోతున్నాయి. బ్యాన్ తుర్కియే అని చెబుతూ.. ఆ దేశం నుంచి అన్ని పండ్లను బహిష్కరిస్తున్నారు. నిషేధం లేకపోయి ఉంటే దాదాపుగా రూ.1200 నుంచి రూ.1500 కోట్ల టర్నోవర్ జరిగేదని.. కానీ పాక్‌కు మద్దతు ఇవ్వడంతో టర్నీ ఇంత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.


ముఖ్యంగా పూణేలోని ఏపీఎంసీ మార్కెట్‌లో యాపిల్ వ్యాపారి సుయోగ్ జెండే మాట్లాడుతూ.. ఈ నిషేధం వల్ల తమకు కూడా కాస్త నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు. కానీ తమకదేమీ పెద్ద ఇబ్బంది కాదని.. దేశానికి శత్రువుగా ఉన్న వాళ్లతో మనం వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. అయినా పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీ యాపిల్స్‌ను ప్రస్తుతం ప్రజలు కూడా కొనుగోలు చేయడం మానేశారని.. ఇది తమకు చాలా ధైర్యాన్ని ఇస్తుందన్నారు. వ్యాపారాలు మనతో చేస్తూ బాగా డబ్బులు సంపాదించుకుని, మనం దేశంపైకే కత్తి దువ్వే వాళ్లకు ఇలాగే సరైన గుణపాఠం చెప్పాలంటూ వివరించారు.


టర్కీ నుంచి యాపిల్స్ కొనుగోలు ఆపేసి.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ మరియు ఇతర ప్రాంతాల నుంచి యాపిల్స ను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పారు. భారత దేశం ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటుంటే.. టర్నీ మాత్రం పాకిస్థాన్‌కు డ్రోన్లను సరఫరా చేసిందని సుయోగ్ జెండే గుర్తు చేశారు. అలాగే టర్కీలో భూకంపం వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన మొదటి దేశం భారత దేశం అని.. కానీ వారు మాత్రం పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com