ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబా వంగా జోస్యం ,,,2025లో ఘోర విపత్తు

international |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 09:00 PM

బల్గేరియాకు చెందిన జ్యోతిష్యురాలు బాబా వంగా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ తెలిసిదే. ఈమె ఇప్పటి వరకు ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, రాబోయే విపత్తుల గురించి జోస్యం చెప్పారు. ఇందులో చాలా వరకు నిజం కూడా అయ్యాయి. దీంతో ఈమె జోస్యంపై అందిలోనూ నమ్మకం ఏర్పడింది. అయితే ఇటీవలే ఈమె 2025లో ఏ పెను విపత్తు సంభవించబోతున్నట్లు చెప్పింది. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేసే స్థాయిలో ఆ విపత్తు ఉంటుందని వివరించింది. దీంతో ఆమె అభిమానులు, ఆమె చెప్పేవన్నీ నమ్మేవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


బల్గేరియాకు చెందిన బాబా వంగా.. చిన్నప్పుడే చూపు కోల్పోయారు. ఇప్పటికే అనేక విషయాలపై భవిష్యవాణి వినిపించారు. అందులో చాలానే నిజం అయ్యాయి. ముఖ్యంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెప్పారు. అందులో కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. ఇలా అది కూడా ఆమె చెప్పినట్లుగానే నిజం అయింది. అయితే 2025లో ఓ పెను విపత్తు జరగబోతున్నట్లు చెప్పగా.. ఇప్పుడు ఆ జోస్యం చర్చలకు దారి తీసింది.


2025లో ఏం జరగబోతుంది?


సాధారణంగా ఏ వారం గడవకుండానే నకిలీ జోస్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంటాయి. కానీ ఈసారి వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం.. బాబా వంగా 2025లో ప్రపంచాన్ని కుదిపేసే ఒక పెద్ద విపత్తు సంభవించబోతుందని జోస్యం చెప్పారు. దీంతో అటు అభిమానులు, ఇటు అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపత్తు అంటే అది ప్రపంచ యుద్ధమా? ప్రకృతి విధ్వంసమా? లేక ఆర్థికంగా కుదేలు అవడమా అనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్పుకొచస్తున్నారు.


ఇవన్నీ నిజంగానే జరిగే అవకాశం ఉందా..?


ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగా భవిష్యాన్ని చెబుతున్నాయా? లేక ఇది మానవ అనుమానాలపై నడుస్తున్న ఊహాగానమా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే గతంలోనూ బాబా వంగా పేరుతో ఎన్నో తప్పుడు జోస్యాలు ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా యథేచ్ఛగా పోస్ట్‌లు రావడం, వాస్తవ పరిశీలన లేకుండానే విశ్వసించడం తలెత్తిన సమస్యలుగా మారుతున్నాయి.


మనుషులపై భవిష్య జోస్యాల ప్రభావం..!


ఇలాంటి భవిష్యవాణులు, సూచనలు ఎప్పుడూ భయాన్ని మాత్రమే కాదు, ఓ ప్రశ్నను కూడా మన మనస్సుల్లో మిగులుస్తాయి. ముఖ్యంగా ఇవన్నీ నిజం అవుతాయా, నిజం అయితే ఏం చేయాల అనే వాటి గురించి ఆలోచిస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com