ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా లా స్టూడెంట్ అత్యాచారం... బయటపడ్డ సంచలన విషయాలు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 10:45 PM

ఇటీవల కోల్‌కతాలో ఓ లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసందే. ఈ ఘటన జూన్ 25న కాలేజీ క్యాంపస్‌లోనే జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. అయితే వారిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు కాలేజీకి వచ్చిన మొదటిరోజు నుంచే.. ప్రధాన నిందితుడు ఆమెను టార్గెట్ చేసినట్లు తేలింది. అంతేకాకుడా.. విద్యార్థిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడాలని నిందితులు ముండే ప్లాన్ వేసినట్లు విచారణలో వెల్లడైంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు నిందితులు మనోజిత్ మిశ్రా, ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్.. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడాలని కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. "ఈ మొత్తం వ్యవహారం ముందే ప్లాన్ చేసిన ప్రకారమే జరిగింది. బాధితురాలిపై ఈ దారుణానికి పాల్పడటానికి వీరు చాలా రోజులు పథకం వేశారు. బాధితురాలు కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే.. ప్రధాన నిందితుడు ఆమెను టార్గెట్ చేశాడని మేము కనుక్కున్నాము" అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.


పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలకు సృష్టించిన కోల్‌కతా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసులో.. 9మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అరెస్టైన నలుగురు నిందితులను విచారిస్తోంది. నిందితులు మనోజిత్, ప్రతిమ్, జైద్.. ముగ్గురూ ఇంతకుముందు పలువురు విద్యార్థిణులను లైంగికంగా వేధించినట్లు తెలిపింది. అయితే నిందితులు ఇలాంటి ఘటనలను మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి.. ఆ తర్వాత విద్యార్థిణులను బ్లాక్ మెయిల్ చేసేవారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నాలుగో నిందితుడు సెక్యూరిటీ గార్డు.


నిందితులు రికార్డ్ చేసిన మొబైల్ వీడియోల కోసం కోల్‌కతా పోలీసులు వెతుకుతున్నారు. ఆదివారం ముఖర్జీ, అహ్మద్ నివాసాలలో సోదాలు చేశారు. ఈ కేసుకి సంబంధించిన వీడియోలతో పాటు ఇతర ఘటనలకు సంబంధించిన వీడియోల కోసం కూడా వెతుకుతున్నామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను నిందితులు ఇతరులకు షేర్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. "ఆ వీడియో క్లిప్‌లను నిందితులు ఎవరికైనా పంపారా లేదా ఇతర గ్రూపుల్లో షేర్ చేశారా అని మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అలా చేస్తే, వాటిని రిసీవ్ చేసుకున్న వారితో మేము మాట్లాడవలసి ఉంటుంది" అని ఓ అధికారి తెలిపారు.


సౌత్ కోల్‌కతా లా కాలేజీలో 25 సాయంత్రం ఘటన జరిగిన సమయంలో కాలేజీలో ఉన్న 25 మందికి పైగా విద్యార్థుల జాబితాను సిట్ తయారు చేసింది. రందరినీ ప్రశ్నిస్తామని తెలిపింది. ఆ సాయంత్రం వారు ఏం చూశారో తెలుసుకోవాలని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులకు శిక్ష పడుతుందని భావిస్తున్నారు. ఈ ఘటన సమాజంలో మహిళల భద్రత గురించి మరోసారి చర్చకు దారితీసింది. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa