ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారుడిని సముద్రంలోకి లాక్కెళ్లిన చేప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 04:15 PM

చేపలు పట్టే మత్స్యకారుడి పాలిట సముద్రంలో గాలానికి చిక్కిన ఓ భారీ చేప యమపాశమైంది. సముద్రంలోకి లాక్కెళ్లడంతో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘటన  వివరాల్లోకి వెళ్తే.. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన చోడపల్లి ఎర్రయ్య(45) మరో ఆరుగురు మత్స్యకారులతో కలిసి నిన్న తెల్లవారుజామున వేటకు బయల్దేరారు. తీరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో చేపలు పడుతుండగా, వారి గాలానికి ఓ పెద్ద చేప చిక్కింది. దాదాపు 100 కిలోల బరువుండే 'కొమ్ముకోనాం' జాతికి చెందిన ఆ చేపను బోటులోకి లాగేందుకు ఎర్రయ్య తాడుతో ప్రయత్నించాడు. అయితే ఆ చేప బలం ముందు అతను నిలవలేకపోయాడు. అదుపుతప్పి పడవలో నుంచి సముద్రంలో పడిపోగా, ఆ చేప అతడిని బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది.కళ్లెదుటే జరిగిన ఈ సంఘటనతో తోటి జాలర్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు ఒడ్డున ఉన్నవారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు హుటాహుటిన పడవల్లో సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ, ఎర్రయ్య ఆచూకీ లభించలేదు. ఈ ఘటనతో పూడిమడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎర్రయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa