ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ఊర్లో ఊంటూ మా భాష మాట్లాడవా.. రెస్టారెంట్ యాజమానిపై దాడి

national |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 07:00 PM

మాతృభాష అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉండాలి. ఇంట్లో, స్కూల్లో, పని చేసే చోట మాతృభాషలో మాట్లాడలని కోరుకోవడం కూడా మంచిదే. అయితే భాషాభిమానం ఉండటం ఎంత ముఖ్యమో.. దురభిమానం ఉండటం అంత చేటు. ఈమధ్యకాలంలో మన దేశంలో భాషాభిమానం పేరుతో జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో కన్నడ మాట్లాడలేదని ఒక బ్యాంకు ఉద్యోగిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని బదిలీ చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మరాఠీ మాట్లాడటం లేదని ఓ రెస్టారెంట్ యజమానిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు ఆవివరాలు..


మహారాష్ట్ర , థానే జిల్లాలోని మీరా భయందర్ సిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఓ రెస్టారెంట్ సిబ్బంది హిందీలో మాట్లాడుతున్నారు. ఇంతలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) సభ్యులు రెస్టారెంట్‌కు వచ్చారు. హిందీ మాట్లాడాలని రెస్టారెంట్ యాజమాని, సిబ్బందిని బలవంతం చేశారు. పైగా ‘మా ఊర్లో ఉంటూ, ఇక్కడ వ్యాపారం చేస్తూ మరాఠీ ఎందుకు మాట్లాడరు’ అని ప్రశ్నించారు. యజమాని, సిబ్బంది మరాఠీ మాట్లాడకపోవడంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు వారిపై దాడి చేశారు.


 రెస్టారెంట్ యజమాని వారితో మాట్లాడుతూ.. ‘నేను మహారాష్ట్రలో అన్ని భాషలు మాట్లాడతారు. నేను వ్యాపారం చేస్తున్నాను. మరాఠీ మాత్రమే మాట్లాడాలంటే ఎలా కుదురుతుందని’ ప్రశ్నించాడు. యజమాని అలా చెప్పడంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మరింత కోపం తెచ్చుకున్నారు. మా ఊర్లో ఉంటూ అన్ని భాషలు ఎలా మాట్లాడతావ్ అంటూ అతడిపై దాడి చేసి.. దారుణంగా కొట్టారు. రెస్టారెంట్‌లో ఉన్న వస్తువులు కూడాపగలగొట్టారు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు రెస్టారెంట్ యజమానిని చెంపదెబ్బలు కొడుతున్న వీడియో వైరల్ అయింది.


ఈ దాడిపై మీరా భయందర్ ప్రాంతంలోని రెస్టారెంట్ యజమానులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూసేనల పేరుతో ఈ దౌర్జన్యం ఏంటని వారు ప్రశ్నించారు. దాడులను ఖండిస్తూ ఆ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో నేడు అనగా గురువారం, జూలై 3న షాపులు మూసివేశారు. మరాఠీ భాష మాత్రమే మాట్లాడాలని దాడులు చేయడాన్ని ఖండించారు. ఇదే పద్దతి కొనసాగితే వ్యాపారాలు మూసేస్తామని హెచ్చరించారు.


ఎంఎన్ఎస్ పేరుతో మరాఠీ భాషనే మాట్లాడాలని బలవంతం చేయడంపై ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర అందరిదీ అని, అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని అంటున్నారు. మరాఠీ భాషనే మాట్లాడాలనే ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు. ఇలాంటి దాడులు కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ప్రజలు అంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa