పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాడు పాక్ సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే.. కేంద్ర ప్రభుత్వం బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ల మీద మరోసారి బ్యాన్ విధించింది.
పహల్గాం ఉగ్రదాడికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తప్పుడు సమాచారం ప్రచారం కాకుండా చూడాలనే ఉద్దేశంతో.. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన పలు ఛానళ్లతో పాటుగా.. దాయాది దేశ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిది ఛానళ్లు, సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేసింది. అలానే పాకిస్తాన్ రక్షణ మంత్రి, ప్రధాన మంత్రి యూట్యూబ్ ఛానళ్లను కూడా బ్లాక్ చేసింది. దీంతో పాటుగా మాజీ పాక్ స్టార్ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ, అహద్ రజా మీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్, సబా కమర్, మావ్రా హొకేన్, హనియా అమీర్ వంటి అనేక మంది పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై బ్యాన్ విధించింది.
అయితే బుధవారం నాడు వీరి సోషల్ మీడియా ఖాతాలు ఇండియాలో ఒపెన్ అయ్యాయి. దీనిపై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికగా పలువురు విమర్శలు చేశారు. వారిపై నిషేధాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వారి ఖాతాలను శాశ్వతంగా బ్యాన్ చేయాలని కోరారు. దీంతో పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్లో మళ్లీ బ్లాక్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు వీరి ఖాతాలను గురువారం ఉదయం నుంచి నిలిపివేసినట్లు సమాచారం. అయితే, ఈ నిషేధం గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు భారత టూరిస్టులపై దాడి చేసి అత్యంత దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ మీడియా, ప్రముఖులపై భారత్ నిషేధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa