ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ డైలాగ్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడ్డా.. పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 09:20 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పవర్‌స్టార్. తన యాక్టింగ్, విభిన్నమైన డైలాగ్ డెలివరీతో పవన్ కళ్యాణ్ భారీగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలన్నా, ఆయన డైలాగులన్నా యూత్‌కు యమ క్రేజ్. ఇక అత్తారింటికి దారేదీ సినిమా అయితే పవర్‌స్టార్ సినీ కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్, డైలాగ్స్.. ఇప్పటికీ ఫ్యాన్స్ నోటిలో నానుతూనే ఉంటాయి. అయితే అత్తారింటికి దారేదీ సినిమాలో ఓ డైలాగ్ చెప్పడానికి పవన్ కళ్యాణ్ తటపటాయించారట. చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ గుర్తుండిపోయిన ఆ ఫేమస్ డైలాగ్ చెప్పడానికి కూడా.. పవన్ కళ్యాణ్‌‍కు ఇబ్బంది పడ్డారంట.. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు.


ప్రకాశం జిల్లా నరసింహపురంలో పవన్ కళ్యాణ్ శుక్రవారం పర్యటించారు. నరసింహపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. " సినిమా నుంచి వచ్చినవాణ్ని సినిమా డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మెడకాయలు కోసేస్తామంటే.. కోయడానికి మేమేమైనా చొక్కా విప్పి చూపిస్తామా? సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, నేను గీసుకోలేదు అనే డైలాగ్‌ సినిమాలో చెప్పడానికి కూడా నేను ఇబ్బంది పడుతా. ఏదో మిమ్మల్ని ఉత్సాహపరచడానికి సరదాగా అలా ఉంటాయి " అని పవన్ కళ్యాణ్ అన్నారు.


మరోవైపు తానెప్పుడూ టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదని అభిప్రాయపడ్డారు. చేతి వేళ్లలో అయిదు సమానంగా ఉండవని.. కానీ బొటనవేలు లేకపోతే కష్టమని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమేనని.. అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తనకు అనుభవం లేదని.. అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి నేత మనకు అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు.


మరోవైపు 2029లో తాము అధికారంలోకి వస్తే అంతుచూస్తామని వైసీపీ నేతలు అంటున్నారన్న పవన్ కళ్యాణ్.. ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తామని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కక్ష ఉండదని మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ను పట్టించుకోలేదన్న పవన్ కళ్యాణ్.. రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టారని ఆరోపించారు. ప్రజలకు కనీసం మంచినీరు ఇవ్వాలనే ఆలోచన కూడా వైసీపీ సర్కారు చేయలేదని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa