భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 23 సార్లు చెప్పారని, రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు.భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఈ నెల 21న పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది."భారత్-పాక్ మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఇప్పటికి 23 సార్లు ఆయన ఆ మాట చెప్పారు. రానున్న శీతాకాల సమావేశంలో రాజ్యసభ, లోక్సభలలో ప్రధానమంత్రి దీనిపై సమాధానం చెప్పాలి. దేశ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు" అని జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa