ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన వ్యక్తిగత కార్యదర్శి కట్టా నరసింహరావు ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ఎమోషనల్ అయ్యారు. నరసింహరావు మృతదేహాన్ని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే వసంత నరసింహరావు మరణం గురించి తెలియగానే హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి మైలవరం నియోజకవర్గంలోని నక్కలంపేట వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి కట్టా నరసింహరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వసంత కృష్ణ ప్రసాద్ నరసింహరావు మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. ఆ బాధను తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే వసంత కట్టా నరసింహారావు కుటుంబానికి ధైర్యం చెప్పారు.. వారిని ఓదార్చారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
'నా వ్యక్తిగత కార్యదర్శి, గొల్లపూడి కార్యాలయం ఇంచార్జి కట్టా నరసింహారావు గారి ఆకస్మిక మృతి అత్యంత బాధాకరం. ఆయన హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ... వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను' అంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోస్ట్ చేశారు.
అలాగే మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు, వసంత ధీమంత్ సాయి కుటుంబ సభ్యులు కట్టా నరసింహరావు బౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందిగామ మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు నరసింహరావుకు
నివాళులర్పించారు.. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. కట్టా నరసింహారావు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండటంతో పాటుగా టీడీపీ బాధ్యతల్ని కూడా చూస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఆయన మరణంతో టీడీపీ నేతలు తీవ్ర విషాదంలో ఉన్నారు.. నరసింహరావుకు నివాళులు అర్పించారు. కట్టా నరసింహరావు ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారని.. ప్రజల సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa