ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖరీఫ్ లో రెండో పంటకు కూడా నీరు అందిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 07:17 PM

ప్రస్తుత ఖరీఫ్ లో రెండో పంటకు కూడా నీరు అందించేందుకు కృషి చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుండి కేసీ కెనాల్ కు నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేయాలని దృఢ సంకల్పం ఉంటే ఏమైనా సాధ్యమవుతుందన్నారు. సుమారు 7500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa