బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యా రావు అడ్డంగా దొరికిపోయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా నటి రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులైన తరుణ్ రాజు, సాహిల్ జైన్లకు ఏడాది జైలు శిక్ష విధించారు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు (కోఫేపోసా) ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ చాలా కాలంగా కొనసాగుతుండగా.. ఇప్పుడు తుది తీర్పు రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. రన్యారావు దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ముఖ్యంగా ఆమె వద్ద నుంచి 14.3 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అలాగే ఈమె ఇంట్లోనూ తనిఖీలు చేశారు. మొత్తంగా రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. అలాగే ఈమెకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పట్టుకున్నారు. వారే తరుణ్ రాజు, సాహిల్ జైన్లు.
అయితే ఈ ముగ్గురు నిందితులు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో సంబంధం కలిగి ఉన్నట్లు విచారణలో వెల్లడి అయింది. దీంతో వీరిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా కోఫేపోసా చట్టం కింద వారిని విచారించారు. ఈ చట్టం విదేశీ మారకం సంరక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణకు సంబంధించిన తీవ్రమైన కేసులను డీల్ చేస్తుంది. సాధారణ నేర చట్టాల కంటే ఇది కఠినమైన నిబంధనలను కలిగి ఉండగా.. దీర్ఘకాల విచారణ తర్వాత అధికారులు వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో శిక్షా కాలంలో వారు బెయిల్ కోసం కూడా ధరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తెలిపింది. దీంతో ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాలి ఉంది. ఈ కేసులో మూడు నెలలకు ఒకసారి విచారణలు కూడా జరుగుతాయని పేర్కొంది. ఇది శిక్షా కాలం ముగిసే వరకు అంటే ఏడాది కాలం పాటు కొనసానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa