ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.6తో లాటరీ కొంటే కోటీ రూపాయలొచ్చాయి

national |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 07:42 PM

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు. లక్ష్మీ దేవి తలుచుకుని లక్కు కలిసొచ్చేలా చేస్తే.. రోజు కూలీ పనులు చేసే వాళ్లు కూడా ఒక్కరోజులోనే లక్షాధికారి అవ్వొచ్చు లేదంటే కోటీశ్వరుడు అవ్వొచ్చు. ఇదే లక్కు తాజాగా ఓ కూలీకి కలిసొచ్చింది. ముఖ్యంగా కేవలం 6 రూపాయలు పెట్టి కొన్న ఓ లాటరీ టికెట్‍తో ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. మరీ ఆ అదృష్టాన్ని దక్కించుకున్న వ్యక్తి ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?


పంజాబ్‌లోని మోగా జిల్లా ధరమ్‌కోట్‌కు చెందిన జస్మాయిల్ సింగ్.. ఓ దినసరి కూలీ. అయితో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఈయనపైనే పెళ్లాం, పిల్లలు ఆధారపడి జీవిస్తున్నారు. అయితే బిడ్డ పెళ్లి, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 లక్షల అప్పు చేశాడు. రోజువారీ కూలీ పనితో సంపాదించే స్వల్ప ఆదాయంతో ఆ అప్పులు తీర్చలేక.. మూడు పూటలా తిండి కూడా తినలేక తెగ ఇబ్బందులు పడిపోతున్నాడు. అంతటి పేదరికం అనుభవిస్తున్న ఈయనకు లక్ష్మీదేవి ఓ మంచి ఆఫర్ ఇచ్చింది. ముఖ్యంగా అతడు 6 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ గెలిచేలా చేసింది.


ఇటీవలే జస్మాయిల్ సింగ్.. స్థానిక లాటరీ విక్రేత వద్ద 'పంజాబ్ స్టేట్ మా లక్ష్మీ దీపావళి పూజ బంపర్ లాటరీ' టిక్కెట్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆరు రూపాయల చొప్పున ఐదు టికెట్లను.. మొత్తం ముప్పై రూపాయలకు కొనుగోలు చేశాడు. జస్మాయిల్ సింగ్ కొన్న టిక్కెట్లలో '50E42140' నంబర్ గల టికెట్ అతని తలరాతను మార్చేసింది. బంపర్ లాటరీ ఫలితాలు ప్రకటించినప్పుడు.. అతను తన టిక్కెట్‌ను తనిఖీ చేయగా మొదటి బహుమతి గెలుచుకున్నట్లు తెలిసింది.


అయితే దీని ప్రైజ్ మనీ కోటి రూపాయలు అని తెలియగానే జస్మాయిల్ సింగ్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. ఎవరో తనను ఆటపట్టిస్తున్నారని భావించాడు. అనేక సార్లు తిరిగి తనిఖీ చేసిన తర్వాత.. ఇది నిజమేనని నిర్ధారించుకున్నాడు. ముఖ్యంగా కాసేపటి తర్వాతే నిర్వాహకులు ఫోన్ చేసి మీరు లాటరీ గెలుచుకున్నారని చెప్పగా.. జస్మాయిల్ సింగ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే లాటరీ గెలిచిన వార్త కుటుంబ సభ్యులకు తెలియగానే.. ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బంధువులు, స్నేహితులు అంతా వచ్చి జస్మాయిల్ సింగ్‌ను అభినందించారు. ఈ ఊహించని ధనంతో తన ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయని, తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉంటుందని జస్మాయిల్ సింగ్ సంతోష పడిపోతున్నాడు.


కోటి రూపాయల ప్రైజ్‌ మనీతో మొదట తాను తీసుకున్న అప్పులన్నీ తీర్చేస్తానని.. ముఖ్యంగా కుమార్తె వివాహం కోసం తీసుకున్న అప్పును తీర్చివేస్తానని తెలిపాడు. ఆ తర్వాత తన కుటుంబం కోసం ఒక కొత్త ఇల్లు నిర్మించుకోవాలని.. తన పిల్లల విద్యకు ఎలాంటిటి ఆటంకం లేకుండా చూసుకోవాలని, వారి భవిష్యత్తును సురక్షితం చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa