భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు అధికంగా చేరుతోంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టంకు చేరడంతో, అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఎగువ నుంచి వచ్చే ఇన్ఫ్లో, అపుట్ఫ్లో ఆధారంగా నీటి విడుదల ఎప్పటికప్పుడు మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. బ్యారేజీ నుండి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నందున కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. నదిలో ప్రయాణాలు చేయరాదని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa