ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముందుగా దానిమ్మ రసంలో, ఆపై సాంబారులో.. భర్తకు విషమిచ్చిన భార్య

Crime |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 07:39 PM

రోజురోజుకూ వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. పరాయి పురుషులతో పడక సుఖం కోసం అనేక మంది మహిళలు భర్తలను చంపేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రియుళ్లలతో కలిసి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతూ.. చివరకు ఊచలు లెక్కబెడుతున్నారు. ఇలాంటివి ఎన్ని ఘటనలు బయటకు వస్తున్నా మిగతా వారు మాత్రం తీరు మార్చుకోకపోవడం లేదు. అచ్చంగా ఇలాంటి పనే చేసిందో తమిళనాడుకు చెందిన మహిళ. ముఖ్యంగా పెళ్లై అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉండగా.. పరాయి పురుషుడితో ప్రేమలో పడింది. అతడితో సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా సాంబారులో విషం కలిపి మరీ అతడిని చంపేసింది. మరి ఈ దారుణం ఎలా బయటకు వచ్చిందంటే..?


తమిళనాడు ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీర్తెపట్టి గ్రామానికి చెందిన 35 ఏళ్ల రసూల్ ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆయనకు భార్య అమ్ముబీ, ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. ఉన్నంతలోనే భార్యాబిడ్డల్ని చక్కగా చూసుకుంటూ హాయిగా జీవితాన్ని వెళ్లదీస్తున్న రసూల్ కాపురంలో చిచ్చు రేగింది. ముఖ్యంగా ఆయన భార్య అమ్ముబీకి, స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. చాలా రోజులుగా.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమె చాటుమాటుగా వ్యవహారం సాగిస్తోంది. అయితే ఇలా చాటుగా కలవడం కష్టం అవుతుండడంతో.. ఇద్దరూ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు.


ముఖ్యంగా ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడే కలిసేలా ఉండేందుకు ఓ పథకం పన్నారు. ప్రస్తుతం తమ బంధానికి అడ్డుగా ఉన్నది తన భర్తే కావడంతో.. అమ్ముబీ అతడిని చంపాలని నిర్ణయించుకుంది. అందుకు ప్రియుడు కూడా ఓకే చెప్పాడు. ఇలా ఇద్దరూ కలిసి అతడిని చంపేందుకు పన్నాగం పన్నారు. ముఖ్యంగా లోకేశ్వరన్ విషం తీసుకు వచ్చి ఇవ్వగా.. అమ్ముబీ భర్త రసూల్‌ను చంపేందుకు సిద్ధం అయింది. వారం రోజుల క్రితమే భర్త ఇంటికి రాగానే.. దానిమ్మ రసం పండి మరీ అందులో విషం కలిపి తీసుకు వచ్చి ఇచ్చింది. కానీ భర్త వద్దనగా.. లోపలికి తీసుకెళ్లి దాన్ని పారబోసింది. ఆపై రాత్రి అతడు తినే భోజనంలో మళ్లీ విషం కలిపింది. ఈ విషయం తెలియని రసూల్ కడుపునిండా భోజనం చేశాడు.


రాత్రి పడుకున్న తర్వాత అతడికి వాంతులు అవ్వడం మొదలైంది. దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే రసూల్‌‌‌‌‌‌‌‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందతూ రసూల్ ప్రాణాలు కోల్పోయారు. అయితే రసూల్ ఒంట్లో పురుగుమందు అవశేషాలు ఉండడంతో.. వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలా వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. భార్యా పిల్లల్ని విచారించగా.. అమ్ము బీపై అనుమానం వచ్చింది. ఈక్రమంలోనే ఆమె సెల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ చాట్ చూడగా.. ప్రియుడు లోకేశ్వరన్ తో చేసిన చాట్ కనిపించింది. ముఖ్యంగా అందులో నువ్విచ్చిన విషం దానిమ్మ రసంలో కలిపిస్తే.. నా భర్త తాగలేదు, అందుకే సాంబారులో కలిపి అన్నం పెట్టాను అని చెప్పింది. ఇలా వీరి నేరం బయటపడగా.. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa