ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేనూ బాధితుడ్నే మళ్లీ హిందువుగా మారుతా.. పియూష్!

national |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 11:27 PM

ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మతమార్పిడి రాకెట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని వెనుక ప్రధాన సూత్రధారి జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో అరెస్టైన వ్యక్తి మతమార్పిడికి తాను కూడా బలైపోయానంటూ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన మొహమ్మద్ అలీ (అసలు పేరు పియూష్ పన్‌వార్) మళ్లీ హిందువుగా మారాలనే కోరిక వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కేసులో వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది అరెస్ట్ కాగా.. మతమార్పిడి, యువతులకు బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో వెల్లడవుతోంది


ఈ ఏడాది మార్చిలో ఆగ్రాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ( 33, 18) అదృశ్యం కేసుపై దర్యాప్తు చేస్తున్న సమయంలో మతమార్పిడి ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆగ్రా పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఇద్దరు యువతుల అదృశ్యంపై విచారణ చేస్తుండగా మతమార్పిడి ముఠా జాడలు బయటపడ్డాయి.. అమెరికా, కెనడాల నుంచి వీరికి నిధులు వచ్చినట్టు కూడా గుర్తించాం’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా లవ్ జీహాద్‌పై తీవ్ర చర్చ జరుగుతోన్న తరుణంలో ఈ కేసు వెలుగులోకి రావడం గమనార్హం.


కాగా, 2021లో రాజస్థాన్‌లోని టోంక్‌ ప్రాంతానికి చెందిన షానా అనే యువతిని పియూష్‌ ప్రేమించాడు. అయితే, తనను వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతాన్ని స్వీకరించాలని షానా కండిషన్ పెట్టింది. దీంతో పియూష్ ఇస్లాం స్వీకరించి అదే ఏడాది తన పేరును మొహమ్మద్ అలీగా మార్చుకున్నాడు. కానీ, షానా పెళ్లికి అంగీకరించకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ముస్లిం యువతిని అలీ వివాహం చేసుకున్నాడు.


ఇస్లాంలోకి మారే సమయంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సభ్యుడు మొహమ్మద్ గౌస్‌ను అలీ కలిశాడు. ఆ తర్వాత ఢిల్లీలోని కలీమ్ సిద్దీఖీ అనే మౌలవీ ద్వారా మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అనంతరం పశ్చిమ బెంగాల్‌లో మదరసాలలో ఖురాన్‌ను అభ్యసించాడు.


గోవాకు చెందిన ఆయేషా అనే యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయంతో ద్వారా మరో ముఠాలో భాగస్వామిగా మారాడు. ప్రస్తుతం అరెస్టైన 10 మందిలో ఆమె కూడా ఒకరు. పోలీసులు వెల్లడించి వివరాల ప్రకారం... ఈ ముఠా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ISIS మాదిరిగానే విస్తరించింది. అలాగే మతమార్పిడి ముఠాలో PFI, SDPI సభ్యుల పాత్ర కూడాఉందని అలీ తెలిపినట్లు సమాచారం.


ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన మొహమ్మద్ అలీ, జునైద్ ఖురేషీ, గోవాకు చెందిన ఆయేషా, కోల్‌కతాకు చెందిన హసన్ అలీ, ఒసామా, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన రహ్మాన్ ఖురేషీ (అగ్రా), అబు తాలిబ్ (ముజఫర్‌నగర్), డెహ్రడూన్‌కు చెందిన అబ్దుర్ రెహమాన్, ఢిల్లీకి చెందిన ముస్తఫాను అరెస్ట్ చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa